Revanth Reddy: పోటీ చేసే స్థానం ఇదే.. సోదరుడు తిరుపతి రెడ్డి క్లారిటీ

by Rajesh |
Revanth Reddy: పోటీ చేసే స్థానం ఇదే.. సోదరుడు తిరుపతి రెడ్డి క్లారిటీ
X

దిశ, మద్దూరు: రేవంత్ రెడ్డి పోటీ చేసే స్థానంపై ఆయన సోదరుడు క్లారిటీ ఇచ్చారు. కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి తెలిపారు. మంగళవారం మద్దూరులో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తమ కుటుంబానికి గుర్తింపు తెచ్చిన నియోజక వర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాల నుంచి పోటీ చేస్తారని ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దని కోరారు.

రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ప్రచారాన్ని రేవంత్ రెడ్డి చేస్తారని నియోజక వర్గం నుంచి యాబై వేలకుపైగా మెజారిటీతో రేవంత్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రి‌గా రేవంత్ రెడ్డి నియోజక వర్గానికి 69 జీఓ ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులూ ఎదురైనా కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఆయన అన్నారు. కార్యక్రమంలో జడ్పీటిసి రఘుపతి రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు తిరుపతి రెడ్డి, సంజీవ్ కుమార్, మహేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, చందు, హుస్సేన్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read..

మూడు ముక్కలుగా చీలిన పార్టీ

Next Story